వరికుంటపాడు మండలం జంగంరెడ్డిపల్లిలో మైనింగ్కు అనుమతులు ఇవ్వొద్దంటూ గ్రామస్థులు, మైనింగ్ బాధిత జేఏసీ సభ్యులు జాతీయ రహదారిపై బైఠాయించి మానవహారం నిర్వహించారు. "గ్రామమే ముద్దు - మైనింగ్ వద్దు" అంటూ నినాదాలు చేశారు. పోలీసుల అవరోధంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనతో హైవేపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి.