కలిగిరి మండలం పోలంపాడు గ్రామానికి ఏర్పాటుచేసిన శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ ముఖద్వారాన్ని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గురువారం ప్రారంభించారు. స్థానిక గ్రామస్తులు బొల్లినేని రామానాయుడు సుబ్బమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు నిర్మించిన, శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ ముఖద్వారాన్ని రిబ్బన్ కటింగ్ చేసి గురువారం ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రామంలోని సీతాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.