వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం అపూర్వ ప్రజాస్పందనతో విజయవంతమైంది. నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ భారీ ర్యాలీలో జనసందోహం కనిపించింది.