ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదివారం మాట్లాడుతూ, సీఎం చంద్రబాబుపై వైసిపి నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అనైతికం అని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పిన వైసీపీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని, అంబటి రాంబాబు నాలుక అదుపులో పెట్టుకోకపోతే టిడిపి కార్యకర్తలు నేరుగా బుద్ధి చెప్పి తీరుతారని ఆయన హెచ్చరించారు.