ఉదయగిరి, గిద్దలూరు నియోజకవర్గాలలోని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుని ఉదయగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ముత్తుముల అశోక్ రెడ్డి అమరావతిలో బుధవారం సాయంత్రం కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మంత్రితో మాట్లాడుతూ రైతులు పండించిన తెల్లబర్లీ పొగాకును కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.