ఏప్రిల్‌లో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు : ప్రభుత్వ విప్ సౌమ్య

AP: కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇవ్వటం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వెల్లడించారు. నందిగామ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సౌమ్య పాల్గొని.. నియోజకవర్గంలో ఉన్న తాగునీటి, సాగునీరు సమస్యల గురించి అర్జీలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్