AP: వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. గతంలో జగన్ విమర్శలకు తీవ్రంగా స్పందించేవారని, అయితే ప్రస్తుతం జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయని, లేనిపోనివి చెబుతున్నారనే వాదన బలపడుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.