వత్సవాయి మండలం కంభంపాడులో చామర్తి వెంకట రామారావు ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. అనారోగ్యంతో రామారావు వారం కిందట గుంటూరు ఆసుపత్రికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు బీరువాలో ఉన్న సుమారు రూ. 60వేల నగదు, 150 గ్రాముల వెండి వస్తువులను అపహరించుకెళ్లినట్లు ఆయన సోదరుడు నారాయణ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.