మైలవరం మండల పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి వాతావరణం చల్లబడి ప్రజలకు ఉపశమనం కలిగింది. అయితే, ఈదురు గాలుల విధ్వంసం, భారీ ఉరుములకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు.