నందిగామ పట్టణంలో గణనాథునికి నోట్ల కట్టలతో అలంకరణ

నందిగామ పట్టణంలో వాసవి బజార్లో 42వ గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని, రాజా దర్బార్ గణపతిని ఏర్పాటు చేసి నిత్య పూజలు అందు కుంటున్నారు. ఈ క్రమంలో నేడు శుక్రవారం గణపతి ఉత్సవాల్లో భాగంగా 2 కోట్ల 70 లక్షల రూపాయలతో వినాయకుని అందంగా అలంకరించారు. కమిటీ వారు ఏర్పాటు చేసిన ఈ కరెన్సీ వినాయకుడిని సందర్శించడానికి భక్తులు క్యూ కడుతున్నారు.

సంబంధిత పోస్ట్