కంచికచర్లలో ద్విచక్ర వాహనాల ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కంచికచర్లలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక గ్యాస్ కంపెనీ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్