గురువారం ఉదయం ఏ. కొండూరు మండలం గోపాలపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కోండ్రుపాడు గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందారు. బైక్ ను కారు ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బైక్ పూర్తిగా తగలబడిపోయిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.