విజయవాడ ఆటోనగర్ శివారు ప్రాంతానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక ఆదివారం స్కూల్లో స్టడీ అవర్స్ ఉన్నాయని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పటమట పోలీసులు కేసు నమోదు చేసుకుని, బాలిక కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.