విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో హైదరాబాద్కు చెందిన సైదా బేగం విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైదా బేగం మహిళలను ఉగ్రవాద దిశగా ఆకర్షించేలా ప్రయత్నించినట్లు, 'KHAWATEEN' అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా జిహాదీ వీడియోలు షేర్ చేసినట్లు తెలుస్తోంది. లాడెన్, జకీర్ నాయక్ వీడియోలను షేర్ చేస్తూ, మదర్సాల్లో శిక్షణ తర్వాత వెపన్ ట్రైనింగ్కు సన్నాహాలు చేసినట్లు సమాచారం. పోలీసులు భారీగా PDF ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు, ఉగ్రవాద నెట్వర్క్పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.