ఏపీలోని కృష్ణా బీచ్లో స్నానానికి వెళ్లి నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి చెందాడు. ఉదయం మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్లో ఐదుగురు విద్యార్థులు స్నానానికి వెళ్లారు. పెద్దఎత్తున సముద్రపు అలలు రావడంతో విద్యార్థులు కొట్టుకుపోయారు. దీంతో అక్కడి మెరైన్ పోలీసులు నలుగురు విద్యార్థులను కాపాడారు. పెద్ద అలలకు మరో విద్యార్థి తోకల అఖిల్ కొట్టుకుపోయారు. చివరికి మంగినపూడి బీచ్లో అఖిల్ మృతదేహం లభ్యమైంది.