బెల్లంకొండ మండలం పాపాయిపాలెంలో డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసింది. తన తండ్రిని దూషించాడనే కోపంతో గోపాలకృష్ణ అనే వ్యక్తి, అదే గ్రామానికి చెందిన కృష్ణయ్య తలపై గొడ్డలితో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడిపోయిన కృష్ణయ్యను స్థానికులు 108లో సత్తెనపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రవీణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.