మాచర్ల రోప్వే కాలనీలో ఆదివారం మద్యం మత్తులో ఉన్న గణేశ్ అనే వ్యక్తి తన భార్యతో గొడవపడి, అడ్డువచ్చిన తన కుమారుడు అభిషేక్పై కత్తెరతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో బాలుడి వీపు, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.