ఎడ్లపాడు పోలీసులు శనివారం మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు. మండలంలోని తిమ్మాపురం జాతీయ రహదారిపై మానసిక స్థితి సరిగ్గా లేకుండా తిరుగుతున్న కాకినాడకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించి, అతని కుటుంబ సభ్యులు వచ్చే వరకు శుక్రవారం, శనివారం వరకు సురక్షితంగా కాపాడి, అనంతరం వారి అప్పగించారు. ప్రజల భద్రతతో పాటు మానవత్వ విలువలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు.