గుంటూరులో YS జగన్ పర్యటన నేపథ్యంలో ఎడ్లపాడు జాతీయ రహదారి వద్ద ఉద్రిక్తత నెలకొంది. YCP నేతల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో పాటు, పలువురు నాయకులకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. హైవేపై కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టారు. తమ నాయకుడిని పరామర్శించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం రాజకీయం చేస్తోందని YCP నేతలు ఆరోపిస్తున్నారు.