వినుకొండ పట్టణంలోని మెయిన్ బజార్లో శనివారం బంగారు వ్యాపారి కోటేశ్వరరావుపై ఐదుగురు వ్యక్తులు దాడి చేసి కొట్టారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. దాడిలో బంగారు వ్యాపారి కోటేశ్వరరావుకు పక్క టేముకలు ఫ్రాక్చర్ అయినట్లు తెలిసింది.