వినుకొండ పట్టణ శివారులోని కారంపూడి రోడ్డులో నరగాయపాలెం క్రాస్రోడ్డు సమీపంలో ఒక వ్యక్తిపై ముగ్గురు దుండగులు దాడి చేశారు. బాధితుడిని విచక్షణారహితంగా కొట్టి, అతని వద్ద ఉన్న నగదు, సెల్ఫోన్ను అపహరించి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.