వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య విగ్రహం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.