బొబ్బిలి మండలం బొడ్డవలస పంచాయితీలోని నిమ్మలపాడు, కొయ్యకొండవలస, సీమిడి గుడ్డివలస, చెల్లివలస, మూలవలస గ్రామాలలో వర్షాకాలం నేపథ్యంలో పిరిడి వైద్యాధికారి డాక్టర్ భరద్వాజ్ సిజినల్ వ్యాధులపై అప్రమత్తత చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మలేరియా నివారణకై, పిరిడి ప్రాధమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది రాపిడ్ టెస్టులు నిర్వహించి, ప్రాధమిక వైద్యం అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యోద్యోగులు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.