విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని సీతయ్యపేట గ్రామంలోగురువారం ఉదయం 9 గంటలకు ఉపాధి హామీ పనులను, వి.బి.జి. రామ్జీ నూతన పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆర్.వి.ఎస్.కే.కే. రంగారావు పరిశీలించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో వి.బి.జి. రామ్జీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో, ఏపీఓ తెలిపారు.