పార్వతీపురం మండలంలోని డోకి శీల గ్రామంలో గురువారం కుటుంబ కలహం నేపథ్యంలో బి. కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య పిల్లల అవసరాల కోసం డబ్బు ఖర్చు చేశానని చెప్పడంతో మనస్తాపం చెందిన కోటేశ్వరరావు వంగ పంటకు ఉపయోగించే మందును తాగినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.