'ఈ-లాట‌రీ ద్వారా ఇళ్ల స్థ‌లాల కేటాయింపు'

డెంకాడ మండ‌లం ర‌ఘుమండ వ‌ద్ద విఎంఆర్‌డిఏ అభివృద్ది చేసిన ఎన్‌టిఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ లేఔట్‌లో మిగిలిన 44 ఎంఐజి ఇళ్ల స్థ‌లాల‌కోసం విజయనగరం జిల్లా క‌లెక్ట‌రేట్లో సోమ‌వారం ఈ-లాట‌రీ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించారు. జెసి ఎస్‌. సేతు మాధ‌వ‌న్‌, డిఆర్ఓ ఎస్‌డి అనిత స‌మ‌క్షంలో కంప్యూట‌ర్ ద్వారా లాట‌రీ నిర్వ‌హించి స్థ‌లాల‌ను కేటాయించారు. లాట‌రీ విజేత‌ల‌కు ప్లాటు కేటాయింపు ప‌త్రాలను అంద‌జేసి, జెసి వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్