మొక్కల పెంప‌కం జీవ‌న‌విధానంలో భాగమవ్వాలి: మంత్రి కొండపల్లి

మొక్కల పెంప‌కం మ‌న జీవ‌న‌ విధానంలో భాగమవ్వాలని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ అన్నారు. వ‌న‌ మ‌హోత్స‌వంలో భాగంగా శుక్ర‌వారం డెంకాడ మండ‌లం బేత‌నాప‌ల్లిలో ఆయన మొక్క‌ల‌ను నాటారు. విజయనగరం జిల్లాలో 6శాతం మాత్ర‌మే అడవులు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన ల‌క్ష్యం ప్ర‌కారం 50 శాతం ప‌చ్చ‌ద‌నం తీసుకురావాలంటే జిల్లాలో ప్ర‌తి రోజూ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం నిరంత‌రాయంగా కొనసాగించాలన్నారు.

సంబంధిత పోస్ట్