ట్రాన్స్ ఫార్మర్స్ చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్ చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సోమవారం జిల్లా పొలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ. నెల్లిమర్ల పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో గణేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ. 1.5లక్షలు విలువ చేసే రాగి, అల్యూమినియం దిమ్మెలను స్వాదీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై 6 పొలీసు స్టేషన్లలో 10 కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్