ఎస్పీ మాధవ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన డిఎస్పి రాంబాబు

పాలకొండ సబ్ డివిజన్ డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎం.రాంబాబు మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవరెడ్డి సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతంగా కలగకుండా చర్యలు చేపట్టాలని, గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్