చెత్త పోగులు నిల్వ వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసన

పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా చెత్త పోగులు నిల్వ ఉంచడానికి వ్యతిరేకిస్తూ స్థానిక మహిళలు మంగళవారం నిరసన చేపట్టారు. సీఐటీయూ నాయకులు డి రమణ రావు వీరికి సంఘీభావం తెలిపారు. ఇక్కడ చెత్తను తక్షణమే తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇదే ప్రాంతంలో కూరగాయల మార్కెట్, వాటర్ ట్యాంకు, లైబ్రరీ, చేపల మార్కెట్ వంటివి ఉన్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్