గుచ్చిమిలో ఏనుగుల గుంపు సంచారం

సీతానగరం మండలం గుచ్చిమి గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు సోమవారం అటవీ అధికారులు తెలిపారు. అటువైపు ప్రయాణించేవారు, పంట పొలాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, వన్యప్రాణులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ఏనుగుల కదలికలను ఎలిఫెంట్ ట్రాకర్స్ నిరంతరం గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తారని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్