కొమరాడ మండలం కురుముపేట మెట్ట పరిసరాల్లోని జీడి తోటల్లో ఆదివారం ఉదయం ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా జీడి తోటలకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లవద్దని, ఉదయం, సాయంత్రం వేళల్లో తోటలకు వెళ్లడం తగ్గించాలని అధికారులు సూచించారు.