భూపాలపల్లి సింగరేణి ఏరియా పరిధిలోని ఓసీ త్రీలో ఘోర ప్రమాదం జరిగింది. మన్యం జిల్లా సీతానగరం మండలం నిడగళ్లకి చెందిన బర్ల సాయికుమార్ అనే కార్మికుడు ఓసీ త్రీలో బ్లాస్టింగ్ విభాగంలో పనిచేస్తున్నాడు. బ్లాస్టింగ్ చేయగా సమీప ప్రాంతంలోనే ఉన్న అతడి తలపై పెద్ద రాయి పడింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.