సీతానగరం మండలం తామర కండి గ్రామ సమీపంలోని చెరుకు తోటలో ఆదివారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. సమీప ప్రాంత రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని, అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.