గరుగుబిల్లి (M) నాగూరు సమీపంలో బుధవారం అదుపుతప్పి ఓ మ్యాక్స్ క్యాబ్ బోల్తా పడింది. పార్వతీపురం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న క్యాబ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న దత్తి రామినాయుడును ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దత్తి రామినాయుడుకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. క్యాబ్లో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు.