పార్వతీపురం మన్యం జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి సూచించారు. జిల్లాలోని 15 మండలాలు డేంజర్ కేటగిరీలో ఉన్నాయని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు రావద్దని, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ తీసుకొని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచనలు జారీ చేశారు.