శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు

రాజాం పట్టణములో కొలువై ఉన్న శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి గురువారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రాత కాలంలో అష్టోత్తర, శ్రీలలితా సహస్రనామావళితో, పుష్పాలతో అర్చనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆషాడ మాసం గురువారం ద్వాదశి కావటంతో అమ్మవారిని దర్శించుకోవడానికి అత్యధికంగా మహిళా భక్తులు విచ్చేశారు. అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి, తమ మొక్కులను చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్