నేడు కొత్తవలసకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శనివారం కొత్తవలస మండలం మంగళ పాలెం రానున్నట్లు కలెక్టర్ బి. ఆర్ అంబేద్కర్ శుక్రవారం తెలిపారు. వెంకయ్య నాయుడు విశాఖలో ఉదయం 8 గంటల 20 నిమిషాలకి బయలుదేరి 10 గంటలకు కొత్తవలస చేరుకుంటారని అన్నారు. అనంతరం 10 గంటల 20 నిమిషాలకు మంగళ పాలెం లోని శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ లో నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించి తిరిగి విశాఖకు వెళ్తారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్