ఎస్. కోట మండలం పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని, చల్లబడి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి అధికంగా కాసిన ఎండల వల్లన ప్రజలు ఇబ్బందిపడ్డారు. మధ్యాహ్నం వర్షం ఒక్కసారిగా కురవడంతో ప్రజలు ఉపశమనం పొందారు. వర్షం ఖరీఫ్ పంటలకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.