పార్వతీపురం మన్యం జిల్లా గదబవలసకు చెందిన హేమలత పిల్లల విద్య కోసం తమన్నా ఫౌండేషన్ అధ్యక్షులు బొడ్డేపల్లి రామకృష్ణారావుని కోరగా, వారి సభ్యులు ఎయిర్ వెటరన్ కాల్లూరి తిరుమల రావు సహకారంతో రూ 5 నగదు.ఇద్దరు పిల్లలకి కావలసిన నోట్ పుస్తకాలు ఇతర సామాగ్రిని విజయనగరం జిల్లా సంక్షేమ అధికారి కె.వి.ఎస్.ప్రసాదరావు చేతులమీదుగా శనివారం అందించారు. సైనిక్ బోర్డు సిబ్బంది జి. లక్ష్మీనారాయణ, శివ, అనిల్, సుమతి పాల్గొన్నారు. సహాయాన్ని అందించిన వారికీ హేమలత కృతజ్ఞతలు తెలియజేసారు.