పవన్ రాజకీయాలకు పనికిరాడు: అంబటి రాంబాబు

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై YCP మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదనే విష ప్రచారం చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ గుడి మెట్లు కడగడంపై కూడా ఆయన స్పందిస్తూ, చంద్రబాబు చెప్పినదంతా నమ్ముతావా అని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పే పవన్ కళ్యాణ్, తిరుమలకు వెళ్లి క్షమాపణ చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్