AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 25 కంప్యూటర్లను బహూకరించారు. సొంత నిధులతో పాఠశాలకు కంప్యూటర్లు, అవసరమైన ఇతర ఫర్నిచర్ను అందజేశారు. కాగా, ఈనెల 5న జరిగిన పేరెంట్స్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ సాయం చేస్తానని మాట ఇచ్చారు.