పిఠాపురంలో ఎవరు గెలుస్తారనే విషయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ సమయంలో పిఠాపురంలో పవన్ గెలుపును జై భారత్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ ఖాయం చేసేశారు. ఇదే క్రమంలో ప్రజల సమస్యలపై పవన్ స్పందించే తీరు, ప్రజా సమస్యలు పరిష్కరించాలనే ధోరణి ఉన్న పవన్ లాంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పిఠాపురంలో పవన్ గెలుస్తారనే తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.