AP: పెట్రోల్, డీజిల్ కొరతతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరతపై కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి చర్చించినట్లు తెలిపారు. డీజిల్పై ఏపీ సివిల్ సప్లై కమిషనర్ చట్టవిరుద్ధమైన ఆదేశాలు జారీ చేశారని, ఈ సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆయన విమర్శించారు.