AP: అమరావతిపై జగన్ కుట్రలను ప్రజలు క్షమించరని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జగన్ కుట్రలు, విధ్వంసకర ఆలోచనలు మరోసారి బయటపడ్డాయన్నారు. జగన్ ఐదేళ్లు అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. గతంలో ఉద్యమించిన మహిళలను బూటు కాళ్లతో తొక్కించారని మండిపడ్డారు. కొద్ది నెలల్లోనే భారీగా అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.