AP: రాజధాని నిర్మాణ పనుల కోసం రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి భారీగా డీజిల్ సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 2 కోట్ల 75 లక్షల 66 వేల లీటర్ల డీజిల్ను సరఫరా చేయాలని ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలను కేంద్ర పెట్రోలియం శాఖ తప్పుబట్టింది. పెట్రోలియం నియమాలు, నిత్యావసర వస్తువుల చట్టానికి ఇది విరుద్ధమని, ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.