పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవా, పిల్లలు అకీరా నందన్, ఆద్యతో కలిసి తీసుకున్న ఫొటోను జనసేన 'ఎక్స్'లో షేర్ చేసింది. "డిప్యూటీ సీఎం పవన్ ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంగళగిరిలోని నివాసానికి బయలుదేరారు. ఈ సమయంలో ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో వాహనాన్ని రోడ్డు పక్క నిలిపి తీసుకున్న ఫోటో ఇది. ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట." అని జనసేన పేర్కొంది.