AP: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల కేసులో వారు నిందితులుగా ఉన్నారు. పిన్నెల్లి సోదరులను 2 వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే.