పిఠాపురం మరోసారి వివాదంలో నిలిచింది. నిన్న తాటిపర్తి ఆలయ బాధ్యతలపై టీడీపీ, జనసేన నేతలు బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. తాజాగా పాదగయ సమీపంలో ఏర్పాటు చేసిన కాకినాడ ఎంపీ ఉదయ్ కుమార్, జనసేన పార్టీ ఫ్లెక్సీలను సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. కనీసం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయకముందే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులు ఎక్కడి వరకు దారి తీస్తాయో వేచి చూడాలి మరి.