AP: టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలు ఇద్దరు సవాళ్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇరువురు నేతలు కార్యకర్తలతో కాకుండా గన్మెన్లతో గోశాలను సందర్శించవచ్చని తెలిపింది. అనంతరం మీడియాతో మాట్లాడి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు.